భూములతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-03-06T06:24:52+05:30 IST

పంట భూములు కోల్పోతున్న గిరిజన రైతులు భూము లతోపాటు ముంపునకు గురయ్యే కృష్ణవరం గ్రామానికి ఆర్‌అండ్‌అర్‌ ప్యాకేజీ పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు కోరారు.

భూములతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వండి

ఎటపాక, మార్చి 5: పంట భూములు కోల్పోతున్న గిరిజన రైతులు భూము లతోపాటు ముంపునకు గురయ్యే కృష్ణవరం గ్రామానికి ఆర్‌అండ్‌అర్‌ ప్యాకేజీ పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు కోరారు. కృష్ణవరం, అచ్యుతాపురం గ్రామాల్లో శుక్రవారం పోలవరం ముంపు భూముల (భూసేకరణ) గ్రామ సభలు నిర్వ హించారు. కృష్ణవరం రెవెన్యూ పరిధిలోని భూపతిరావుపేట, కృష్ణవరం, చింతల చెరువు గ్రామాల్లో 1,082 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నట్టు అధి కారులు సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు మాట్లాడుతూ ఎకరం భూమిలో 80సెంట్ల భూమి ముంపు జాబితాలో ఉందని దానికే పరి హారం చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారని, మిగిలిన కొద్దిపాటి భూమిని ఏం చేసుకోవాలని, దానికి కూడా పరిహారం ఇవ్వాలన్నారు. తమకు సహాయ పునరావాసం కల్పించిన చోటే పంట భూములు కేటాయించా లని కోరారు. కాగా అచ్యుతాపురం సభలో 98 ఎకరాలు ముంపుకు గురవుతు న్నట్టు అధికా రులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ ఇన్స్‌ప్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ లీలా ప్రసాద్‌, పోలవరం డిప్యూటీ కలెక్టర్‌ వి.రాజన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T06:24:52+05:30 IST