నారా లోకేశను కలిసిన కురుబ సంఘం నాయకులు

ABN , First Publish Date - 2022-08-20T04:55:24+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నా రాలోకేశను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పెనుకొండ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శి, రాష్ట్ర కురుబ కార్పొరేషన మాజీ చైర్‌పర్సన సవిత, కురుబసం ఘం నాయకులు కలిశారు.

నారా లోకేశను కలిసిన కురుబ సంఘం నాయకులు
కనకదాసు చిత్రపటంతో సత్కరిస్తున్న కురుబ సంఘం నాయకులు

పెనుకొండ, ఆగస్టు 19: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నా రాలోకేశను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పెనుకొండ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శి, రాష్ట్ర కురుబ కార్పొరేషన మాజీ చైర్‌పర్సన సవిత, కురుబసం ఘం నాయకులు కలిశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం, కురుబ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లు నాయకులు తెలిపారు. ఈసంద ర్భంగా సవిత... నారా లోకేశకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కురుబ సాంప్రదాయ పద్ధతిలో కంబళికప్పి, కనకదాస చిత్ర పటం జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు శివబాల, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసు లు, డ్వాక్రా రామాంజనేయులు, అడదాకులపల్లి ప్రసాద్‌, సామకోటి ఆదినారాయణ, కదిరి రామ్మోహన, బ్యాళ్ల నాగేంద్ర, రాము, చిత్తూ రు వళిగట్ల వెంకటరమణ, నాగభూషణం, హేమంతకుమార్‌, సో మశేఖర్‌, చలపతి, వెంకటేశ, సదాశివ, కర్నూలు బత్తని వెంకటరాముడు, ఆదోని నాగేంద్రప్ప, నాగభూషణ, రాజగోపాల్‌, జయరాము లు, శ్రీనివాసులు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు, కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T04:55:24+05:30 IST