నేటి నుంచి మహాకుంభాభిషేకం పూజలు

ABN , First Publish Date - 2022-08-15T08:08:07+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం నుంచి మహాకుంభాభిషేక పూజలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి మహాకుంభాభిషేకం పూజలు
అధికారులతో మాట్లాడుతున్న ఈవో సురే్‌షబాబు

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 14: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం నుంచి మహాకుంభాభిషేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావండతో ఈ నెల 21న మహాకుంభాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో హోమాలు నిర్వహించడానికి యాగశాలను భారీగా నిర్మించారు. సోమవారం నుంచి 21 వరకు హోమాలు నిర్వహించి 21న ఆలయంలో చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం జరపనున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో సురే్‌షబాబు పర్యవేక్షించి.. అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 21న హాజరయ్యే ప్రముఖులకు, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాలను నిలపడానికి ప్రత్యేక పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రమే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ, ఏఈవో రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T08:08:07+05:30 IST