రైలుకింద పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-07-01T06:16:42+05:30 IST
రైలుకింద పడి వ్యక్తి మృతి
కొత్తూర్, జూన్ 30: కొత్తూర్ శివారులో వినాయక స్టీల్ పరిశ్రమ వెనుక గల రైల్వేపట్టాల వద్ద రైలు కింద పడి గూడెం పాషా(35) అనే వ్యక్తి మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జమిస్తాపూర్ ప్రాంతానికి చెందిన గూడెం పాషా శంషాబాద్లో కూలీగా పనిచేస్తుంటాడని తెలిపారు. బుధవారం రాత్రి రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశత్తూ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం షాద్నగర్తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణ తెలిపారు.