వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-18T06:16:27+05:30 IST

స్థానిక రాఘవేంద్రకాలనీలో నివా సముంటున్న వివాహిత శివలక్ష్మి (24) శనివారం ఉరేసుకుం ది. బాధితురాలి తండ్రి తెలిపిన వివరాలివి.

వివాహిత ఆత్మహత్య
శివలక్ష్మి మృతదేహం

యాడికి, ఏప్రిల్‌ 17: స్థానిక రాఘవేంద్రకాలనీలో నివా సముంటున్న వివాహిత శివలక్ష్మి (24) శనివారం ఉరేసుకుం ది. బాధితురాలి తండ్రి తెలిపిన వివరాలివి. కర్నూలు జిల్లా దొర్నిపాడు గ్రామానికి చెందిన శివ ఎరికలరెడ్డి తన కుమా ర్తె శివలక్ష్మిని అదే మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన శివరామిరెడ్డికి ఇచ్చి 2015లో వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా 10 తు లాల బంగారం ఇచ్చారు. శివరామిరెడ్డి యాడికిలో మగ్గం నేస్తూ సంసారం నెట్టుకొచ్చే వాడు. వీరికి ఒక కుమారుడు సంతానం. ఈ క్రమంలో శివరామిరెడ్డి మద్యానికి బానిసగా మారి భార్యను నిత్యం వేధించేవాడు. అదనపు కట్నం తేవాలని హింసించేవాడు. దీంతో మనస్తాపం చెందిన శివలక్ష్మి తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుంది. విషయం తెలుసు కున్న మృతురాలి తండ్రి వచ్చేసరికి మృతదేహాన్ని భర్త తన సొంత గ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లి కుమార్తె మృతదేహాన్ని తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-04-18T06:16:27+05:30 IST