కూలీలను విభజించే చర్యలను మానుకోవాలి
ABN , First Publish Date - 2021-07-27T04:43:59+05:30 IST
కూలీలను విభజించే చర్యలను మానుకోవాలి
- దళిత, గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్
షాద్నగర్ : కులాలవారీగా కూలీలను విభజించి కూలి డబ్బులు చెల్లించేచర్యలను మానుకోవాలని దళిత, గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం షాద్నగర్ ఆర్డీవో రాజేశ్వరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘాల దేశవ్యాప్త నిరసనలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం నేత రాజు, గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనునాయక్, వ్యకాస జిల్లా కార్యదర్శి బద్దుల జంగయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో కులాల వారీగా కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పోరాడి ఉపాధిహామీని సాధించారని, ఇది ప్రభుత్వాలు పెట్టే భిక్ష కాదని అన్నారు. ఉపాధిహామి పథకంలో పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడ ుదల చేయాలని డిమాండ్ చేశారు.