ఓటీఎస్ మెగా మేళాను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2022-01-22T05:04:36+05:30 IST
ప్రతి గ్రామ సచివాలయంలో ఓటీఎస్పై శనివారం నిర్వహించే మెగా మేళాను విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారి ముక్కంటి ఆదేశించారు.
రాజానగరం, జనవరి 21: ప్రతి గ్రామ సచివాలయంలో ఓటీఎస్పై శనివారం నిర్వహించే మెగా మేళాను విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారి ముక్కంటి ఆదేశించారు. రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. మండలంలో ఓటీఎస్లో లబ్ధిదారులు స్వచ్ఛందంగా నగదు చెల్లించేలా చైతన్యవంతుల్ని చేయడంతోపాటు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. నగదు చెల్లించిన లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్ పత్రాలు అందించాలన్నారు. అర్హులైన వారంతా ఓటీఎస్ పధకాన్ని వినియోగించుకునేలా గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వలంటీర్లు, హౌసింగ్ ఉద్యోగులు సమష్టి కృషి చేయాలన్నారు. ఎంపీడీవో ఎన్వీవీవీఎస్ మూర్తి, హౌసింగ్ ఏఈ నగేష్ పాల్గొన్నారు.