విద్యార్థుల ఆరోగ్యంపై ఎమ్మెల్యే ఆరా
ABN , First Publish Date - 2021-06-17T04:53:34+05:30 IST
శ్రీకాకుళంలోని గిరిజన యువజన శిక్షణా కేంద్రంలోని విద్యార్థుల ఆరోగ్యంపై పాల కొండ ఎమ్మెల్యే వి.కళావతి ఆరా తీశారు.
: శ్రీకాకుళంలోని గిరిజన యువజన శిక్షణా కేంద్రంలోని విద్యార్థుల ఆరోగ్యంపై పాల కొండ ఎమ్మెల్యే వి.కళావతి ఆరా తీశారు. ఇక్కడి విద్యార్థులు కరోనా బారిన పడడం... దీనిపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కళావతి బుధవారం సాయంత్రం శ్రీకాకుళంలోని వైటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందిలేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గిరిజన సంఘం నాయకుడు వాబ యోగేశ్వరరావు పాల్గొన్నారు.