నిరాడంబరంగా లక్ష్మీనర్సింహుడి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2021-04-24T05:18:25+05:30 IST

మండల కేంద్రంలోని ఏకశిలా గుట్టపై స్వయంభుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు కొవిడ్‌ నిబంధనల మేరకు శుక్రవారం నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా లక్ష్మీనర్సింహుడి కల్యాణోత్సవం
కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

బెజ్జంకి, ఏప్రిల్‌ 23: మండల కేంద్రంలోని ఏకశిలా గుట్టపై స్వయంభుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు కొవిడ్‌ నిబంధనల మేరకు  శుక్రవారం నిరాడంబరంగా నిర్వహించారు. పంచామృత అభిషేకం, సహస్ర పుష్పార్చన నిర్వహించి ధ్వజారోహణ నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఆలయ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి సమర్పించారు. ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌ మంజుల, ఆలయ వైస్‌ చైర్మన్‌ ఐలయ్య, ఆలయ ప్రధాన అర్చకులు శేషం మధుసూదనచారీ, శ్రీవాత్సవచారీ, ఆలయ ఈవో విశ్వనాధశర్మ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.


 

Updated Date - 2021-04-24T05:18:25+05:30 IST