ఈటలను కలిసిన ముదిరాజ్ నాయకులు
ABN , First Publish Date - 2021-05-09T05:07:04+05:30 IST
ఈటలను కలిసిన ముదిరాజ్ నాయకులు
కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని ముదిరాజ్ సంఘం నాయకులు శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం సమంజసం కాదన్నారు. తాము ఈటల వెంటే ఉంటామని చెప్పారు. ఈకార్యక్రమంలో బాల్రాజ్, నర్సిములు, ఎంట్లమల్లయ్య, రాములు, సాయిలు, సత్యపాల్, అనంతయ్య, బాబయ్యనాయుడు, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.