ఇక్కడ దళారీలదే హవా

ABN , First Publish Date - 2021-11-15T06:21:11+05:30 IST

ముక్కంటి ఆలయ పరిసరాల్లో దళారీల బెడదతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

ఇక్కడ దళారీలదే హవా
మర్రిచెట్టుకు దారాలు కడుతున్న భక్తులు

శ్రీకాళహస్తి, నవంబరు 14: ముక్కంటి ఆలయ పరిసరాల్లో దళారీల హవా పెరిగింది. కార్తీకమాసం పురస్కరించుకుని స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మాయమాటలు చెప్పి దగా చేస్తున్నారు. దోష పరిహారార్థం వచ్చే భక్తులను ఆలయ ఒకటో గేటు వద్ద ఉన్న మర్రిచెట్టుకు పసుపుదారాలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. సంకల్పం నెరవేరుతుందంటూ దారాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు దళారీల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. మరోవైపు కార్తీకమాసంలో దీపారాధన కోసం వచ్చే మహిళలకు నకిలీ నేతిదీపాలను విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి దళారీల మోసాలకు చెక్‌పెట్టాల్సి ఉంది. 

Updated Date - 2021-11-15T06:21:11+05:30 IST