భార్యను హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2021-12-02T05:35:41+05:30 IST

నగరంలో భార్య ను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

భార్యను హత్య చేసిన భర్త

అనంతపురం క్రైం, డిసెంబరు 1: నగరంలో భార్య ను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వనటౌన పోలీసులు తెలిపిన మేర కు.. నగరంలోని ఉమానగర్‌లో నివాసం ఉం టున్న వై. అనిల్‌కుమార్‌, పద్మజ అలియాస్‌ లావణ్య (33)కు 14ఏళ్ల కిందట వివాహామైం ది.  వీరికి ఇద్దరు పిల్లలు. అనిల్‌కుమార్‌ పలు రకాల వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పో షించేవాడు. గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తరచూ గొడవ పడేవారు. ఇది ఇలా ఉండగా బుధవారం ఉదయా న్నే పిల్లలిద్దరూ స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో దంపతుల మధ్య గొడవ జరిగింది.  పరిస్థితి తారస్ధాయికి చే రడంతో అనిల్‌కుమార్‌ ఇంటిలోని గొడ్డలి తీసుకుని భార్య తలపై బాదడంతో తీవ్ర రక్తస్రా వం జరిగి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతసేపటికి స్థానికులు గమనించి వనటౌన పోలీసులకు స మాచారం అందించారు. సీఐ ప్రతాపరెడ్డి, సిబ్బందితో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇద్దరు పిల్లలు ఆస్పత్రికి చేరుకుని బోరుమని విలపించారు. 


Updated Date - 2021-12-02T05:35:41+05:30 IST