జాతీయ స్థాయిలో సదుం గురుకుల విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-03-02T05:50:47+05:30 IST

సదుం మహాత్మాజ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు.

జాతీయ స్థాయిలో సదుం గురుకుల విద్యార్థుల ప్రతిభ
విద్యార్థి గురుప్రసాద్‌

 సదుం, మార్చి 1: సదుం మహాత్మాజ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఇండియన్‌ సైన్స్‌ టెక్నో ఫెస్టివల్‌లో భాగంగా న్యూఢిల్లీలో గత నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి సైన్సు క్విజ్‌ పోటీల్లో సదుం గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థులు డి.గురుప్రసాద్‌ బంగారు పతకాన్ని, జి. సూర్యతేజ రజిత పతకాన్ని సాధించారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది, వైసీపీ నాయకులు విద్యార్థులను అభినందించారు. 

Updated Date - 2021-03-02T05:50:47+05:30 IST