నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలి : తహసీల్దార్
ABN , First Publish Date - 2021-07-25T05:45:09+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కార్డు లబ్ధిదారులకు నవంబరు నెల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని, బియ్యం కార్డుదారులకు సక్రమంగా అందించకపోయినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ రమేషన పేర్కొన్నారు.
అగళి, జూలై 24: కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కార్డు లబ్ధిదారులకు నవంబరు నెల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని, బియ్యం కార్డుదారులకు సక్రమంగా అందించకపోయినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ రమేషన పేర్కొన్నారు. మండలంలోని నరసాంబుది గ్రామంలో శనివారం ఎఫ్పీషాపును తనిఖీ చేశారు. బియ్యం కార్డు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఐ మహబూబ్బాషా, డీలరు, కార్డులబ్ధిదారులు ఉన్నారు.