కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-11-28T07:29:30+05:30 IST
జిల్లాలో శుక్ర, శనివారాల మధ్య 24 గంటల వ్యవధిలో 28 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించగా.. కొవిడ్తో ఎవరూ మరణించలేదు.
తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల మధ్య 24 గంటల వ్యవధిలో 28 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించగా.. కొవిడ్తో ఎవరూ మరణించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 24,7944కు చేరుకోగా కొవిడ్ మరణాల సంఖ్య మాత్రం 1953గా ఉంది. కాగా.. శనివారం ఉదయానికి జిల్లాలో 290 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. తాజా కేసులు మదనపల్లె, పూతలపట్టు మండలాల్లో నాలుగు చొప్పున, తిరుపతి అర్బన్, చిత్తూరు, శ్రీకాళహస్తి మండలాల్లో మూడు వంతున, పలమనేరు, తిరుపతి రూరల్, సోమల మండలాల్లో రెండు చొప్పున, పీలేరు, కేవీపల్లె, రేణిగుంట, గుర్రంకొండ, నిమ్మనపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.