హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-24T05:12:49+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యఽథాతథంగా కొనసాగించాలని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి
టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

-టీడీపీ, అనుబంధ సంఘాల డిమాండ్‌

అనంతపురం అర్బన, సెప్టెంబరు 23: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యఽథాతథంగా కొనసాగించాలని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీ స్థాపించిన ఎన్టీఆర్‌ పేరునే మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం జగన పునరాలోచించి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీధర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేదర చంద్రశేఖర్‌, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహులు, మాజీ మేయర్‌ స్వరూప, శింగనమల ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ విశాలాక్షి, తెలుగు మహిళారాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, రాష్ట్ర అధికార ప్రతినిధి తేజశ్విని, టీడీపీజిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నగరఅధ్యక్షుడు మారుతీకుమార్‌గౌడ్‌,  నాయకులు గంగవరం బుజ్జి, మేదర  శ్రీవర్థన, డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, సైఫుద్దీన, సిరిశాల రాంబాబు,  చిట్రా జానకి, హసీనా, రమాదేవి, శోభ పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-09-24T05:12:49+05:30 IST