నవరత్న నిలయంలో అద్దాల మహల్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-21T06:17:48+05:30 IST
శ్రీకాళహస్తి పట్టణ శివారులోని జగనన్న కాలనీ వద్ద నిర్మించిన నవరత్న నిలయంలో అద్దాల మహల్ను శుక్రవారం రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ప్రారంభించారు.
శ్రీకాళహస్తి అర్బన్, ఆగస్టు 20: శ్రీకాళహస్తి పట్టణ శివారులోని జగనన్న కాలనీ వద్ద నిర్మించిన నవరత్న నిలయంలో అద్దాల మహల్ను శుక్రవారం రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎ్సఆర్ విగ్రహాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. కాలనీ లేఅవుట్ మధ్యలో మర్రిచెట్టు వద్ద నిర్మించిన రచ్చబండపై వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి నిర్మించిన నవరత్న నిలయం ఎప్పటికీ ప్రజలకు గుర్తుండి పోతుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు, ఎస్సీవీ దిలీప్, పవిత్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.