యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-22T05:42:36+05:30 IST

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శుక బ్రహ్మాశ్రమ పీఠాధిపతి విద్యాస్వరూపానందగిరి స్వామి అన్నారు.

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాళహస్తిలో ప్రసంగిస్తున్న విద్యా స్వరూపానందగిరి

శ్రీకాళహస్తి, జూన్‌ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శుక బ్రహ్మాశ్రమ పీఠాధిపతి విద్యాస్వరూపానందగిరి స్వామి అన్నారు. సోమవారం స్థానిక శుక బ్రహ్మాశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికే పరిమితమైన ప్రాచీన యోగా విద్యను విదేశాలకు విస్తరించడం హర్షణీయమన్నారు. యోగాతో ఆరోగ్యరక్షణ సాధ్యమనీ, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. శరీరం, మనసును ఏకం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. యోగా గురువు మార్కండేయులు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగా చేయవచ్చనీ, ఇందుకు అనుగుణంగా సహకరించేలా శరీరం తయారవుతుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో సర్వాత్మానందస్వామి, బీజేపీ నాయకులు కోలా ఆనంద్‌, రమే్‌షబాబు, న్యాయవాది రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:42:36+05:30 IST