పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలి
ABN , First Publish Date - 2021-06-22T05:45:32+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని శ్రీకాళహస్తిలో ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి అర్బన్, జూన్ 21: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ అంబేడ్కర్ కూడలి వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైభీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు పులి శ్రీకాంత్ మాట్లాడుతూ... ధరల పెంపుతో కరోనా కష్టకాలంలో మోదీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. పనుల్లేక సతమతమవుతున్న పేదలకు పెరిగిన నిత్యావసర ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు. ప్రజల శ్రమను కొల్లగొట్టే ప్రభుత్వంగా బీజేపీ పేరు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో గంధం మణి, గురవయ్య, చందమామల కోటయ్య, బషీర్, సాయిమోహన్, లోకయ్య, మునికుమారి తదితరులు పాల్గొన్నారు.