చెరువు పూడ్చివేత పనులు నిలిపివేయాలి
ABN , First Publish Date - 2021-03-02T05:55:03+05:30 IST
కొత్తపల్లి, మార్చి 1: గ్రామస్థుల అవసరాల కోసం ఉన్న చెరువు పూడ్చివేత పనులు ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడా చెరువులు పూడ్చరాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సోమవారం కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి పంచాయ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
కొత్తపల్లి, మార్చి 1: గ్రామస్థుల అవసరాల కోసం ఉన్న చెరువు పూడ్చివేత పనులు ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడా చెరువులు పూడ్చరాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సోమవారం కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి పంచాయతీ శివారు పెదకలవలదొడ్డిలో సచివాలయ భవన నిర్మాణం కోసం చేపట్టిన చెరువు పూడ్చివేత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయ భవన నిర్మాణాలను మరొక స్థలంలో చేపట్టాలన్నారు. స్థల సేకరణ కోసం ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయన్నారు. చెరువుల పూడ్చివేత కారణంగా భవిష్యత్తులో భూగర్భజలాలు అడుగంటుపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. గ్రామస్థుల అభీష్టం మేరకు అధికారులు సచివాలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువు పూడ్చివేత పనులు ఆపివేయాలని తహశీల్దార్తో వర్మ ఫోన్లో మాట్లాడారు.