తపాలా ఉద్యోగులకు పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2022-05-16T06:37:37+05:30 IST

రాజమహేంద్రవరం పోస్టల్‌ డివిజన్‌ స్థాయి 2021-22 ఆర్థిక సంవత్సరానికి పురస్కారాల ప్రదానోత్సవం స్థానిక జూపూడి జగన్నాథరావు పంక్షన్‌ హాలులో జరిగింది.

తపాలా ఉద్యోగులకు పురస్కారాల ప్రదానం

రాజమహేంద్రవరం సిటీ, మే 15: రాజమహేంద్రవరం పోస్టల్‌ డివిజన్‌ స్థాయి 2021-22 ఆర్థిక సంవత్సరానికి పురస్కారాల ప్రదానోత్సవం స్థానిక జూపూడి జగన్నాథరావు పంక్షన్‌ హాలులో జరిగింది. రాజమహేంద్రవరం డివిజనల్‌ సూపరింటెండెంట్‌ కేవీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పోస్టల్‌ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ముత్యాల వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో ఉన్నతంగా ప్రజలకు సేవలందిస్తున్నారని, లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారని, డివిజన్‌ను అగ్రగామిగా నిలబెట్టడంలో ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారన్నారు. అనంతరం ఉత్తమ సేవులందించిన పోస్టల్‌ ఉద్యోగులకు పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో గౌరవ అతిథి, రిటైర్డ్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ శిక్షకుడు జి.నాగేశ్వరరావుతోపాటు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కె.శ్రీధరం, ఎ.నారాయణ, గంటి రామకృష్ణ, కె.శేషారావు, ఎన్‌.రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:37:37+05:30 IST