ఆర్యవైశ్య మహిళా విభాగంజిల్లా కార్యదర్శిగా ప్రసన్నలక్ష్మి
ABN , First Publish Date - 2021-04-18T06:06:35+05:30 IST
ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ క్రిష్ణం ప్రసన్నలక్ష్మి నియమితులయ్యారు.
అనతపురం టౌన, ఏప్రిల్ 17: ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ క్రిష్ణం ప్రసన్నలక్ష్మి నియమితులయ్యారు. కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆమెకు ఆ విభాగ జిల్లా అధ్యక్షురాలు రూపా రాగిణి చేతులమీదుగా నియామకపత్రం అందజేశారు.