‘ప్రైవేటు’ ఉపాధ్యాయులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-05-09T05:44:30+05:30 IST
కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ముళ్ల మాధవ్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
గోదావరి సిటీ(రాజమహేంద్రవరం), మే 8: కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ముళ్ల మాధవ్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడటంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు లేక వారంతా ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతీనెల రూ.2 వేలు ఆర్థిక సాయం, నిత్యావసరాలు అందించేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీలో కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు.