పేరుకుపోయిన మురుగుతో ఇబ్బందులు
ABN , First Publish Date - 2021-05-10T05:33:00+05:30 IST
ఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లీలో మురుగు కాల్వలను శుభ్రం చేయకపోవడంతో పేరుకు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నారాయణఖేడ్, మే 9: ఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లీలో మురుగు కాల్వలను శుభ్రం చేయకపోవడంతో పేరుకు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలరోజుల నుంచి కాల్వలను శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోందని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా మురుగు నీరు ఇళ్ల పునాదుల్లోకి చేరుతుందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పేరుకుపోయిన మురుగును తొలగింపజేయాలని కోరుతున్నారు.