మెరుగైన సేవలు అందించండి
ABN , First Publish Date - 2021-08-03T05:25:12+05:30 IST
రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆగ్రోస్ ఎండీ సంగంరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. సోమవారం బొద్దాం రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందజేయాలన్నారు.
ఆగ్రోస్ ఎండీ కృష్ణమూర్తి
రాజాం ఆగస్టు 2: రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆగ్రోస్ ఎండీ సంగంరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. సోమవారం బొద్దాం రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందజేయాలన్నారు. రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ క్రాప్లో నమోదు అన్ని రాయితీ వర్తిస్తాయన్నారు కార్యక్రమంలో ఏడీఏ సీహెచ్ వెంకటరావు, ఏవో ఎం.రేణుకాసాయి తదితరులు పాల్గొన్నారు.