పీవీ రావుకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-05-11T04:38:57+05:30 IST

మాలమహానాడు వ్యవ స్థాపక అధ్యక్షుడు పీవీరావు జయంతి వేడుకలను మండలం లోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.

పీవీ రావుకు ఘన నివాళి

అమలాపురం రూరల్‌, మే 10: మాలమహానాడు వ్యవ స్థాపక అధ్యక్షుడు పీవీరావు జయంతి వేడుకలను మండలం లోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. సోమవారం పేరూరు అంబేడ్కర్‌ నగర్‌లో యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీవీరావు చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయ కులు జల్లి శ్రీనివాసరావు, జల్లి సోమశేఖర్‌, ముత్తాబత్తుల వీరవెంకటసత్యనారాయణ, ముత్తాబత్తుల శ్రీనివాస్‌   పాల్గొ న్నారు. అదేవిధంగా అమలాపురం సూర్యనగర్‌లో జిల్లా మాలమహానాడు కన్వీనర్‌ చీకురుమెల్లి కిరణ్‌కుమార్‌ ఆధ్వ ర్యంలో పీవీరావు జయంతిని నిర్వహించారు. పలువురు మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.

దేవగుప్తంలో పీవీరావు జయంతి

  మాలమహానాడు వ్యవస్థాపక అధ్య క్షుడు స్వర్గీయ పీవీరావు జయంతి ఆయన స్వగ్రామం దేవ గుప్తంలో ఘనంగా నిర్వహించారు. పీవీరావు  స్వగృహం వద్ద సోదరుడు పోతుల నాగరాజు ఆధ్వర్యంలో పీవీరావు చిత్ర పటానికి  పలువురు పూలమాలలువేసి నివాళులర్పించారు. దేవగుప్తం ఇందిరానగర్‌, కాశిపేటలలో పీవీరావు జయంతి నిర్వహించారు. ఈకార్యక్రమాల్లో పోతుల నాగరాజు, ఉల్లింగి రమణ, కె.వెంకటరెడ్డి, తరెట్ల చిట్టిబాబు, పోతుల నాగార్జున, ముత్తాబత్తుల రాంబాబు  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:38:57+05:30 IST