పలు ప్రాంతాల్లో వర్షం
ABN , First Publish Date - 2022-05-17T07:45:37+05:30 IST
తిరుపతి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షం కురిసింది.
తిరుపతి, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షం కురిసింది. తిరుమలలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురిసింది.శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షంతో ఇబ్బందిపడ్డారు. గదులు లభించని భక్తులు,ఘాట్రోడ్లలో ప్రయాణించే వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు.సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చలితీవ్రత కొండపై పెరిగింది. తిరుపతిలో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.చంద్రగిరి, పాకాల,రేణిగుంట,రామచంద్రా పురం,పిచ్చాటూరు మండలాల్లోనూ వర్షం కురిసింది.