అన్ని వర్గాలకు సమన్యాయం

ABN , First Publish Date - 2020-11-27T05:17:36+05:30 IST

అన్ని వర్గాలకు సమ న్యాయం చేకూరే విధంగా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపారు.

అన్ని వర్గాలకు సమన్యాయం

 గుజరాతీపేట: అన్ని వర్గాలకు సమ న్యాయం చేకూరే విధంగా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని జిల్లా జడ్జి  జి.రామకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ, సీనియర్‌ జడ్జి నాగమణి, శాశ్వత లోక్‌అదాలత్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు. 


 విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపా రు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరమేనన్నారు. పీఎల్‌ఏపీయూఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:17:36+05:30 IST