కంచుకోటపై పగ ఎందుకంటే..
ABN , First Publish Date - 2021-11-14T07:02:44+05:30 IST
కుప్పం మున్సిపల్ పరిధిలో 59 శాతం మంది ప్రజలు టీడీపీ వెంట ఉండటమే దీనికి కారణం
చిత్తూరు,ఆంధ్రజ్యోతి: రాష్ట్రంలోని స్థానిక, మున్సిపల్ ఎన్నికలన్నింటినీ నయానో, భయానో దాదాపుగా గెలుచుకున్న వైసీపీ కుప్పం అనే చిన్న, కొత్త మున్సిపాలిటీ కోసం ఎందుకింతగా సకల శక్తులనూ ఒడ్డుతోంది? సర్వ వ్యూహాలనూ పన్నుతోంది? పదే పదే 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నామంటూ ప్రకటించే వైసీపీ నేతల్లో ఆత్మవిశ్వాసం ఎందుకు కొరవడింది? గతంలో జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 8 గ్రామ పంచాయతీల ప్రజలు అత్యధికంగా ఎవరిని ఆదరించారో పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇది టీడీపీ కంచుకోట కావడమే కారణం. వైసీపీ ఫ్యానుగాలి హోరు రాష్ట్రమంతా హోరెత్తినా కుప్పం మున్సిపల్ పరిధిలో మాత్రం 59 శాతం మంది ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. ఈ ఎనిమిది పంచాయతీల్లోనూ 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. 2009, 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగింది. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు చంద్రబాబుకు దరిదాపుల్లో కూడా లేరు.
ఇదీ టీడీపీ బలం
2009 సాధారణ ఎన్నికల్లో
మొత్లం పోలైన ఓట్లు : 21,411
టీడీపీకి పడిన ఓట్లు : 14,039 (69%)
కాంగ్రె్సకు పోలైనవి : 5617 (22%)
మెజార్టీ : 8422
2014 ఎన్నికల్లో మొత్తం
పోలైన ఓట్లు : 24,346
టీడీపీకి పడినవి : 16,274 (66%)
వైసీపీకి : 7,224 (30%)
మెజార్టీ : 9050
2019 ఎన్నికల్లో పోలైన
మొత్తం ఓట్లు : 27,262
టీడీపీకి పడిన ఓట్లు : 17,146 (59%)
వైసీపీకి పడినవి : 8065 (34%)
కాంగ్రెస్కు : 1043 (3%)
మెజార్టీ : 9081