ఆర్టీసీని లాభాలబాట పట్టిస్తాం

ABN , First Publish Date - 2022-08-08T06:10:51+05:30 IST

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు.

ఆర్టీసీని లాభాలబాట పట్టిస్తాం

ఐ.పోలవరం, ఆగస్టు 7: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. పాత ఇంజరం వద్ద అమలాపురం-జి.మూలపొలం ఆర్టీసీ బస్సు సర్వీసును ఆదివారం ఆయన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న ముమ్మిడివరం తదితర ఆర్టీసీ బస్టాండ్ల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, మోర్త రాణి మిరియాంజ్యోతి, వైసీపీ మండల కన్వీనర్‌ పిన్నమరాజు శ్రీనురాజు, అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ సీహెచ్‌ సత్యనారాయణ, ఎన్‌.వరహాలబాబు, రమేష్‌బాబు, నాయకులు సాధనాల త్రిమూర్తులు, పాలెపు ధర్మారావు, కాటం సత్తిరాజు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-08T06:10:51+05:30 IST