రగ్బీ పోటీల్లో ద్వితీయ స్థానం
ABN , First Publish Date - 2021-03-01T05:53:13+05:30 IST
పిఠాపురం, ఫిబ్రవరి 28: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానం సాధించింది. కర్నూలులో గతనెల 27,28న బాలుర,
పిఠాపురం, ఫిబ్రవరి 28: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానం సాధించింది. కర్నూలులో గతనెల 27,28న బాలుర, బాలికల రగ్బీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలికల జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జట్టు, కోచ్ లక్ష్మణరావును జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్, సోము గోవిందరాజు, బి.సింహాచలం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పద్మనాభం తదితరులు అభినందించారు.