తండ్రి చేతిలో కొడుకు హతం

ABN , First Publish Date - 2021-05-11T17:05:26+05:30 IST

జిల్లాలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య నెలకొన్న గొడవలో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.

తండ్రి చేతిలో కొడుకు హతం

సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య నెలకొన్న గొడవలో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి శ్రీనివాస్ గౌడ్ కొట్టడంతో  తనయుడు సాయి కుమార్ (25 )దుర్మరణం చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-05-11T17:05:26+05:30 IST