ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-04-23T04:57:56+05:30 IST
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఎఫ్జడ్ 8779 విమానంలో ప్రయాణికుడు 386 గ్రాముల బంగారాన్ని కరిగించి టీ షర్ట్లో పెట్టుకుని తీసుకొస్తుండగా తనిఖీల్లో బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని సీజ్ చేశారు. కాగా బంగారం విలువ దాదాపు రూ.19.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.