ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-12-08T05:14:17+05:30 IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న
శంషాబాద్ రూరల్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకు న్నారు. కువైట్ నుంచి శంషాబాద్ విమానా శ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.11లక్షలు ఉంటుందని తెలిపారు. పట్టుబడిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.