కబడ్డీ పోటీలకు ‘మోడల్‌’ విద్యార్థినుల ఎంపిక

ABN , First Publish Date - 2021-03-06T05:51:56+05:30 IST

రాష్ట్రస్థాయి 47వ జూనియర్‌ కబడ్డీ పోటీలకు రేగోడు మోడల్‌ పాఠశాల విద్యార్థులు శివాని, దీపిక ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ మంజరి, ఫిజికల్‌ డైరెక్టర్‌ శోభ శుక్రవారం తెలిపారు.

కబడ్డీ పోటీలకు ‘మోడల్‌’ విద్యార్థినుల ఎంపిక
ఎంపికైన విద్యార్థినులు శివాని, దీపిక

రేగోడు మార్చి 5: రాష్ట్రస్థాయి 47వ జూనియర్‌ కబడ్డీ పోటీలకు రేగోడు మోడల్‌ పాఠశాల విద్యార్థులు శివాని, దీపిక ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ మంజరి, ఫిజికల్‌ డైరెక్టర్‌ శోభ శుక్రవారం తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లో ఈ నెల 7 వరకు జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులను, ప్రిన్సిపాల్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ను ఎస్‌ఎంసీ చైర్మన్‌ స్వప్న, అధ్యాపక బృందం అభినందించారు.

Updated Date - 2021-03-06T05:51:56+05:30 IST