15 మందికి సేవా పతకాలు

ABN , First Publish Date - 2022-05-24T07:55:00+05:30 IST

జిల్లాలో 2020 ఏడాదికిగాను ఉత్తమ సేవలు అందించిన 15 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందికి గతంలో ఉత్తమ సేవా పతకాలను అధికారులు ప్రకటించారు.

15 మందికి సేవా పతకాలు
సేవా పతకాలు అందుకున్న పోలీసులతో ఎస్పీ రిషాంత్‌రెడ్డి

ప్రదానం చేసిన ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు, మే 23: జిల్లాలో 2020 ఏడాదికిగాను ఉత్తమ సేవలు అందించిన 15 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందికి గతంలో ఉత్తమ సేవా పతకాలను అధికారులు ప్రకటించారు. వీరికి సోమవారం ఎస్పీ రిషాంత్‌రెడ్డి పతకాలను అందించారు. పతకాలు అందుకున్న వారిలో.. మదనపల్లె డీఎస్పీ కె.రవిమనోహరాచ్చారి, పీలేరు అర్బన్‌ సీఐ సాధిక ఆలీ, చౌడేపల్లి హెడ్‌కానిస్టేబుల్‌ విశ్వనాథం, మదనపల్లె టూటౌన్‌ హెచ్‌సీ జ్ఞాన ప్రకాష్‌, దిశ మహిళా పీఎస్‌ హెచ్‌సీ దేవరాజులురెడ్డి, యాదమరి స్టేషన్‌కు చెందిన గోపినాథరెడ్డి, దుర్గాప్రసాద్‌, దామోదరం, రఘురామన్‌, కాణిపాకం పీఎ్‌సకు చెందిన దిలీ్‌పకుమార్‌, తవణంపల్లెకు చెందిన సుధాకర్‌, చిత్తూరు సీసీఎ్‌సకు చెందిన తనికాచలం, పాకాల పీఎ్‌సకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి, డీటీసీ ఫాల్గుణ ఉన్నారు.

Updated Date - 2022-05-24T07:55:00+05:30 IST