డబుల్ బెడ్రూం ఇంటిని తిరిగిచ్చేసిన మరో మహిళ
ABN , First Publish Date - 2021-01-22T14:31:34+05:30 IST
రెండు పడకల ఇళ్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఫర్వీన్ సుల్తానా అనే మహిళ తన ఉదారత్వాన్ని చాటింది.
సిద్దిపేట: రెండు పడకల ఇళ్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఫర్వీన్ సుల్తానా అనే మహిళ తన ఉదారత్వాన్ని చాటింది. పట్టణంలోని 11వ వార్డులో నివసిస్తున్న ఫర్వీన్ సుల్తానాకు సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్లో బ్లాకు నెంబరు 29 రూమ్ నెంబరు7లో ప్రభుత్వ రెండు పడకల ఇళ్లు మంజురైంది. మరోవైపు తన బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇళ్లు కట్టుకునే ఆలోచన వచ్చి తనకు మంజూరు అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో గురువారం రాత్రి కలిసిన ఫర్వీన్.. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ను మరొక లబ్దిదారుకు ఇచ్చే ఆలోచనతో ముందుకొచ్చినట్లు, అందుకు సంబంధించిన స్థల పత్రాలను మంత్రి చేతికి తిరిగి ఇచ్చేసింది. ఈ మేరకు ఫర్వీన్ సుల్తానా ఉదారత్వం చూసిన మంత్రి హరీశ్ రావు... భార్యాభర్తలను అభినందించి వారిద్దరికీ శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఇదే పట్టణానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కూడా తనకు మంజూరు అయిన డబుల్ బెడ్ రూం ఇంటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే.