ఖరీఫ్ సాగుకు సింగూరు జలాలు
ABN , First Publish Date - 2021-07-27T03:57:01+05:30 IST
ఖరీఫ్ సీజన్ దృష్ట్యా సింగూరు జలాలను సాగుకు విడుదల చేయాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నీటి పారుదల శాఖ ఈఈ మధుసూదన్రెడ్డిని కోరారు.
నీటి పారుదల శాఖను కోరిన ఎమ్మెల్యే
పుల్కల్, జూలై 26: ఖరీఫ్ సీజన్ దృష్ట్యా సింగూరు జలాలను సాగుకు విడుదల చేయాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నీటి పారుదల శాఖ ఈఈ మధుసూదన్రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన నీటి పారుదల శాఖకు లేఖ రాశారు. సింగూరు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలపై ఆధారపడిన రైతులు వరినాట్లు వేసుకుంటామని వెంటనే సింగూరు జలాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని, ఉన్నతాధికారులను సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఈఈ మధుసూధన్రెడ్డి తెలిపారు.