మహనీయుడు గుర్రం జాషువా

ABN , First Publish Date - 2020-09-29T11:44:55+05:30 IST

సమాజంలో నెలకొన్న పరిస్థితులను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చి ఆలోచింపజేసిన మహనీయుడు గుర్రం జాషువా అని ప్రిన్సిపాల్‌ ఎంఆర్‌ జ్యోతి ఫ్రెడరిక్‌ అన్నా రు.

మహనీయుడు గుర్రం జాషువా

నరసన్నపేట, సెప్టెంబరు 28: సమాజంలో నెలకొన్న పరిస్థితులను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చి ఆలోచింపజేసిన మహనీయుడు గుర్రం జాషువా అని ప్రిన్సిపాల్‌ ఎంఆర్‌ జ్యోతి ఫ్రెడరిక్‌ అన్నా రు. జాషువా జయంతిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గబ్బిలం, ఫిరదౌసి వంటి రచనలు చేసిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా ఒకరని అన్నారు.కార్య క్రమంలో తెలుగు అధ్యాపకులు జీవీ రవికుమార్‌, సురేఖ, శ్రీనివాస పాత్రో, లుక్‌ పాల్‌, పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


జాషువాకు ఘన నివాళి

పాలకొండ(కొత్తూరు): కొత్తూరు మండలం మెట్టూరులో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. మండల కళాకారుల సంఘం అధ్యక్షుడు గేదల సుందర నారాయణ ఆధ్వర్యంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్య క్రమంలో నౌపడ జగ్జీవన్‌రావు, లింగమూర్తి,

రాజారావు, బుచ్చయ్య, లక్ష్మ ణదాస్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T11:44:55+05:30 IST