తిరుమల నడకదారిలో పదడుగుల పాము
ABN , First Publish Date - 2022-05-17T07:47:22+05:30 IST
అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద సోమవారం పది అడుగుల పొడవున్న కొండచిలువను భక్తులు గమనించి భయంతో పరుగులు తీశారు.
తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద సోమవారం పది అడుగుల పొడవున్న కొండచిలువను భక్తులు గమనించి భయంతో పరుగులు తీశారు.భద్రతా సిబ్బంది వెంటనే టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని ఆ కొండ చిలువను పట్టుకోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.