జోరుగా అసాంఘిక కార్యకలాపాలు
ABN , First Publish Date - 2021-04-21T05:57:48+05:30 IST
అమ్మవారి తీర్థాలు, జాతర్లలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి.
ముమ్మిడివరం, ఏప్రిల్ 20: అమ్మవారి తీర్థాలు, జాతర్లలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ముమ్మిడివరం ఎస్ఐ కేవీ నాగార్జున వారం క్రితం సస్పెండ్ అయిన విషయం విదితమే. దీంతో ఇన్చార్జితోనే నడుస్తోంది. సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో జూదర్లు పేట్రేగిపోతున్నారు. క్రాపచింతలపూడిపాలెంలో సోమవారం రాత్రి అశ్లీల నృత్య ప్రదర్శనలతో పాటు పేకాట, గుండాటలను భారీస్థాయిలో నిర్వహించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.