శ్రీ ఆంజనేయం
ABN , First Publish Date - 2022-08-07T05:39:44+05:30 IST
శ్రావణ మాసం రెండో శనివారం కసాపురంలో సీతారామ లక్ష్మణులు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు.
గుంతకల్లు/డి హీరేహాళ్/బొమ్మనహాళ్, ఆగస్టు 6: శ్రావణ మాసం రెండో శనివారం కసాపురంలో సీతారామ లక్ష్మణులు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆంజనేయస్వామివారి మూల విరాట్టును విశేషంగా అలంకరించారు. అభిషేకాలు, అర్చనలు చేశారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్పర్సన సుగుణమ్మ, ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. డి హీరేహాళ్ మండలంలోని మురడి ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, కుంకుమార్చన, బిల్వార్చన చేశారు. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చారు. బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లులో ఆంజనేయస్వామికి విశేష పూజలు జరిగాయి. వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణుపారాయణం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. పుష్పాలంకరణ చేసి నైవేద్యం సమర్పించారు. ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ చార్యులు మహామంగళహారతి పట్టారు. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది తరలివచ్చారు. భక్తులకు అన్నదానం చేశారు.