యువ అర్చకుల ‘శ్రీవారి పాదసేవ’
ABN , First Publish Date - 2021-07-25T06:29:25+05:30 IST
మిరాశీ కుటుంబాల నుంచి తిరుమల శ్రీవారి అర్చకత్వానికి గతనెల 24న ఎంపికైన ఎనిమిది మంది యువ అర్చకులు శనివారం ‘శ్రీవారి పాదసేవ’ చేశారు.
తిరుమల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మిరాశీ కుటుంబాల నుంచి తిరుమల శ్రీవారి అర్చకత్వానికి గతనెల 24న ఎంపికైన ఎనిమిది మంది యువ అర్చకులు శనివారం ‘శ్రీవారి పాదసేవ’ చేశారు. మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులు స్వామివారి కైంకార్యలకు పూనుకునే ముందు ఈ పాదసేవ చేయడం ఆనవాయితీ. గర్భాలయంలోని మూలమూర్తిని తాకి కైంకర్యాలకు సిద్ధమని చెబుతూ అర్చకులు పాదసేవ చేశారు. వీరికి టీటీడీ అధికారులు గౌరవప్రదంగా శ్రీవారి మేల్చాట్ వస్త్రాన్ని అందజేశారు.