బోట్క్లబ్కు స్వచ్ఛభారత్ పురస్కారం
ABN , First Publish Date - 2020-12-03T05:38:55+05:30 IST
సర్పవరం జంక్షన్, డిసెంబరు 2: పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల నిర్వహణతో బోట్క్లబ్ పార్కుకి స్వచ్ఛభారత్ పురస్కారం
సర్పవరం జంక్షన్, డిసెంబరు 2: పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల నిర్వహణతో బోట్క్లబ్ పార్కుకి స్వచ్ఛభారత్ పురస్కారం లభించినట్టు బోట్క్లబ్ వాకర్స్ సంఘం అధ్యక్షుడు అడబాల రత్నప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు కాకినాడ కార్పొరేషన్ నుంచి స్వచ్ఛభారత్ పురస్కారం అందిందని, పురస్కారం సాధించడం ఆనందంగా ఉందన్నారు. క్లబ్ సభ్యుల ఆధ్వర్యాన పలు కాలేజీల విద్యార్థులు, ఎన్ఎ్సఎస్ వాలంటీర్లు, స్వచ్ఛద సంస్థల సహకారంతో క్రమం తప్పకుండా పార్కులో స్వచ్ఛభారత్ కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి వై.శ్రీనివాస్, సంఘం కార్యదర్శి డి.శ్రీధర్, కె.శ్రీరామరాజు, ఎం.సుబ్బారావు, బాపిరాజు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.