‘మత్స్యకార భరోసా’ అందేలా చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-06-20T05:33:38+05:30 IST
మండలంలోని మరువాడ పంచాయతీలో అర్హు లైన వారికి మత్స్యకార భరోసా వర్తించేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు.
సంతబొమ్మాళి, జూన్ 19: మండలంలోని మరువాడ పంచాయతీలో అర్హు లైన వారికి మత్స్యకార భరోసా వర్తించేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. ఈ పంచాయతీలోని 35 మంది మత్స్యకారులు అర్హులైనప్పటికీ మత్స్యకార భరోసా అందలేదని సూరాడ ధనరాజ్, సూరాడ దాసు రాజు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటా మని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.