కుంగ్ఫూలో కొందుర్గు విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2022-05-21T05:01:33+05:30 IST
కుంగ్ఫూలో కొందుర్గు విద్యార్థుల ప్రతిభ
కొందుర్గు, మే 20: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన న్యూమంక్స్ కుంగ్ఫూ 15వ ఇంటర్ జిల్లాస్థాయి పోటీల్లో కొందుర్గు విద్యార్థులు ప్రతిభ చాటినట్లు మాస్టర్ రమేష్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకం సాధించిన జి.కరుణాకర్కు, వెండిపతకం సాధించిన మేఘన, సింధు, మౌనిక, పావని, అభివన్ కార్తిక్లకు మహబూబ్నగర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్, కనకం యాదవ్లు పతకాలను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ఆమనగల్లు, మే 20: విద్యార్థులు, యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్సరెడ్డి అన్నారు. రాచూర్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం శ్రీనివా్సరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రోత్సాహకంగా రూ.10వేలు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు శ్రీనివా్సరెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మపర్వతాలు, నిర్వాహకులు రాజు, నిరంజన్, రమేశ్, రాఘవేందర్, బాలకృష్ణ, పడకంటి వెంకటేశ్, తిరుపతయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.