కొవిడ్ బాధితులకు అండగా టీడీపీ : బీకే
ABN , First Publish Date - 2021-06-17T06:19:10+05:30 IST
కొవిడ్ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు.
పెనుకొండ, జూన 16: కొవిడ్ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన మోహన రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్ల రాష్ట్రంలో కరోన కేసులు, మరణాలు అధికమయ్యాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించి భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కరోనా బాధితులకు తమవంతు సాయం అందించి ఆదుకుంటోందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరుస్తున్నామన్నారు. ఈ క్రమంలో కరోనా బాదితులకు ప్రభుత్వం పరిహారం కోసం 8144226661 నంబర్కు మిస్డ్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కొవిడ్ బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్నారు. బాధితులకు న్యాయబద్దంగా అందాల్సిన పరిహారం అందేవిధంగా టీడీపీ పోరాడుతుందన్నారు.