టీడీపీ పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-10-27T07:02:57+05:30 IST
నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ ప్రయోజనాలకు, పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేయాలని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కోరారు.
కొత్తపేట, అక్టోబరు 26: నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ ప్రయోజనాలకు, పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేయాలని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కోరారు. సోమవారం రాత్రి ఆర్ఎస్ బీసీ కన్వెన్షన్ హాలులో నూతనంగా ఎన్నికైన కమిటీల సభ్యులతో మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, గొల్లపల్లి సూర్యారావు ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా వారు వైసీపీ నియంతృత్వ పాలనపై మండిపడ్డారు. సమావేశంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, నేతలు ఆకుల రామకృష్ణ, నామన రాంబాబు, కటకంశెట్టి ప్రభాకర్, మోకా ఆనందసాగర్, డొక్కా నాఽథ్బాబు, ఎం.గంగసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.