Nimmala ramanaidu: వాళ్లకు పట్టిన గతే పెద్దిరెడ్డికి పడుతుంది
ABN , First Publish Date - 2022-09-07T17:52:43+05:30 IST
సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో విలన్ పాత్ర పోషిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
చిత్తూరు: సీఎం జగన్మోహన్ రెడ్డి (CM jagan reddy) డైరెక్షన్లో మంత్రి పెద్దిరెడ్డి(Peddireddy ramachandra reddy) కుప్పంలో విలన్ పాత్ర పోషిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం చిత్తూరు సబ్ జైలులో కుప్పం టీడీపీ నేతల (TDP Leaders)ను నిమ్మల పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సినిమాల్లో విలన్ పాత్ర పోషించే వ్యక్తులకు ఏ గతి పడుతుందో వేరే విధంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో పెద్దిరెడ్డి (AP Minister) డైరెక్షన్లో అశాంతి రౌడీ అరాచకం కొనసాగుతోందని వ్యాఖ్యలు చేశారు. ఏపీ (Andhrapradesh)లో ఎప్పుడు ఎన్నిక జరిగినా పురాణాల్లో విలన్లకు ఏ గతి పట్టిందో అదే గతి పెద్దిరెడ్డికి పడుతుందని హెచ్చరించారు.
పెద్దిరెడ్డికి ఒక మంత్రిగా గుర్తింపు లేదు గాని దొంగ ఓట్లు వేసే వ్యక్తిగా ఆయనకు బ్రహ్మాండమైన గుర్తింపు ఉందని యెద్దేవా చేశారు. దోపిడీకి, దొంగతనానికి, అరాచకానికి దొంగ ఓట్లకు ప్రాధాన్యత వహించే పెద్దిరెడ్డికి వడ్డీతో సహా రుణం తీర్చుకునే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు (Chandrababu naidu) సీఎం కావడం ఖాయమని... టీడీపీ (TDP)పై అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు (YCP Leaders) 10 రెట్లు శిక్ష అనుభవించడం ఖాయమని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.