యనమలను కలిసిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-13T05:30:00+05:30 IST

తొండంగి, అక్టోబరు 13: శాసనమండలి ప్రతిపక్ష నేత, ఆర్థిక శాఖా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును బుధవారం మండలంలోని ఏవి.నగరంలో పలువురు టీడీపీ నేతలు కలిసి నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా తదితరులు యనమలను కలిశారు. కల్యాణ వేంకటేశ్వరుని దర్శించుకు

యనమలను కలిసిన టీడీపీ నేతలు
యనమల రామకృష్ణుడుతో చినరాజప్ప, వర్మ

తొండంగి, అక్టోబరు 13: శాసనమండలి ప్రతిపక్ష నేత, ఆర్థిక శాఖా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును బుధవారం మండలంలోని ఏవి.నగరంలో పలువురు టీడీపీ నేతలు కలిసి నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా తదితరులు యనమలను కలిశారు. కల్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు, నాయకులు కోడ వెంకటరమణ, పేకేటి హరికృష్ణ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-13T05:30:00+05:30 IST